hyderabadupdates.com Gallery రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ రియాన్ ప‌రాగ్ పై వేటు

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ రియాన్ ప‌రాగ్ పై వేటు

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ రియాన్ ప‌రాగ్ పై వేటు post thumbnail image

రాజ‌స్తాన్ : ఐపీఎల్ 2026లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మెరుగైన ఆట‌తీరు క‌న‌బ‌రుస్తున్న‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు కెప్టెన్ రియాన్ ప‌రాగ్ దుందుడుకు స్వ‌భావం కార‌ణంగా ప‌లు చిక్కులు ఎదుర‌వుతున్నాయి. తాజాగా త‌ను సంచ‌ల‌నంగా మారాడు. ఇందుకు కార‌ణం ముల్లాన్ పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ తో మ్యాచ్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో రియాన్ ప‌రాగ్ ఈ-సిగరెట్‌ తాగుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష ప్రసార టీవీలో స్పష్టంగా కనిపించిన ఈ చర్య, భారత చట్టాలను, స్టేడియం నిబంధనలను ఉల్లంఘించేదిగా ఉంద. దీనివల్ల ప‌రాగ్ కు జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
కాగా రియాన్ ప‌రాగ్ నిర్వాకంపై సీరియ‌స్ గా స్పందించింది బీసీసీఐ. స‌ద‌రు క్రికెట‌ర్ నుండి వివ‌ర‌ణ కోరామ‌ని తెలిపింది. ఆ త‌ర్వాత త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించింది. బీసీసీఐ, ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ బాడీ రూల్స్ ప్ర‌కారం మొద‌టిసారి చేసిన నేరానికి రియాన్ ప‌రాగ్ కు ఒక సంవ‌త్స‌రం జైలు శిక్ష లేదా రూ. ల‌క్ష జ‌రిమానా ఎదుర్కొనే అవ‌కాశం ఉంది. భారత చట్టాల ప్రకారం ‘వేపింగ్’ చేయడం చట్టవిరుద్ధం. దీంతో త‌న‌కు శిక్ష త‌ప్ప‌ద‌ని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. చాలా మంది ఆటగాళ్లు e-సిగరెట్లు వాడుతుంటారు, కానీ వారు వాటిని డ్రెస్సింగ్ రూమ్‌లో తాగరు. చుట్టూ ఇన్ని కెమెరాలు ఉన్నప్పుడు అలా చేయడం చాలా ప్రమాదకరం. ప‌రాగ్ బ‌హిరంగంగా చేశాడు. త‌న‌కు త‌ప్ప‌కుండా శిక్ష ప‌డ‌టం ఖాయం అంటున్నారు మాజీ క్రికెట‌ర్లు.
The post రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ రియాన్ ప‌రాగ్ పై వేటు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Ajit Pawar: చిక్కుల్లో అజిత్‌ పవార్‌ కుమారుడుAjit Pawar: చిక్కుల్లో అజిత్‌ పవార్‌ కుమారుడు

  మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ కుమారుడు పార్థ్‌ పవార్‌కు చెందిన కంపెనీ… పుణెలో భూ ఒప్పందంలో అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలపై సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ స్పందించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందానికి రెవెన్యూ అడిషనల్‌

టెక్నాల‌జీని ప్రోత్స‌హించాం ఐటీని అభివృద్ది చేశాంటెక్నాల‌జీని ప్రోత్స‌హించాం ఐటీని అభివృద్ది చేశాం

హైదరాబాద్ : నాలెడ్జి ఎకానమీదే భవిష్యత్తు అని ఆలోచన చేసి టెక్నాలజీని ప్రోత్సహించి ఐటీని అందిపుచ్చుకున్నాం అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. హైద‌రాబాద్ లోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) లో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న పాల్గొని

తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవంతిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం

తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పార్వేట‌ ఉత్సవం తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది. గోదా పరిణయోత్సవం కూడా కన్నుల పండువ‌గా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్‌ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు