hyderabadupdates.com Gallery సంజు శాంస‌న్ అత్యంత ప్ర‌మాద‌క‌ర ఆట‌గాడు

సంజు శాంస‌న్ అత్యంత ప్ర‌మాద‌క‌ర ఆట‌గాడు

సంజు శాంస‌న్ అత్యంత ప్ర‌మాద‌క‌ర ఆట‌గాడు post thumbnail image

చెన్నై : ఈసారి ఐపీఎల్ 2026లో ప‌లుసార్లు ఛాంపియ‌న్ గా గెలుపొంద‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు అనుకోకుండా వ‌రుస‌గా మూడు మ్యాచ్ ల‌లో ప‌రాజ‌యం పాలైంది. ఈ స‌మ‌యంలో ఏరికోరి ఏకంగా రూ. 18 కోట్లు ఖ‌ర్చు చేసింది సీఎస్కే ఒకే ఒక్క ఆట‌గాడు కేర‌ళ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్ కోసం. అంతే కాదు త‌న జ‌ట్టు నుంచి ఇద్దరు ముఖ్య‌మైన ఆట‌గాళ్లు సామ్ క‌ర‌న్ , ర‌వీంద్ర జ‌డేజాల‌ను అప్ప‌గించింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు. ఇదే క్ర‌మంలో ఇండియాలో జ‌రిగిన ఇండియా, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హించిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో దుమ్ము రేపాడు సంజు శాంస‌న్ . త‌ను కేవ‌లం 5 ఇన్నింగ్సులు ఆడి 321 ర‌న్స్ చేశాడు. ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. దీంతో నేష‌న‌ల్ హీరోగా మారి పోయాడు శాంస‌న్. ఇక చెన్నై జ‌ట్టుకు తిరుగులేద‌ని భావించారు త‌మిళ తంబీలు.
కానీ ఊహించ‌ని విధంగా వ‌రుస‌గా 9,6,7 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు శాంస‌న్. అంద‌రూ త‌న‌ను తిట్ట‌డం ప్రారంభించారు. కానీ నిన్న చెన్నై వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ఢిల్లీ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. సెంచ‌రీతో క‌దం తొక్కాడు. 15 ఫోర్లు 4 భారీ సిక్స‌ర్ల‌తో త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. జ‌ట్టుకు విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు. ఈ సంద‌ర్బంగా సీఎస్కే జ‌ట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మీడియాతో మాట్లాడాడు. సంజు శాంస‌న్ చాలా ఆధిపత్యం చెలాయించగల ఆటగాడు. అంతే కాదు మోస్ట్ డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్ అంటూ పేర్కొన్నాడు. ఇదే స‌మ‌యంలో సంజు శాంస‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. త‌న సెంచ‌రీని స్టీఫెన్ ఫ్లెమింగ్ కు అంకితం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.
The post సంజు శాంస‌న్ అత్యంత ప్ర‌మాద‌క‌ర ఆట‌గాడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CJI BR Gavai: కేంద్ర ప్రభుత్వంపై సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఆగ్రహంCJI BR Gavai: కేంద్ర ప్రభుత్వంపై సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఆగ్రహం

    కేంద్ర ప్రభుత్వం తన ధర్మాసనం నుంచి తప్పించుకోవాలని చూస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు. కేసు తుది వాదనలు వినడానికి సిద్ధమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణను కోరుకోవడాన్ని

SSC Exam Schedule: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ షెడ్యూల్ విడుదలSSC Exam Schedule: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ షెడ్యూల్ విడుదల

  ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ఎస్ఎస్‌సీ బోర్టు విడుదల చేసింది. ఎస్ఎస్‌సీ బోర్టు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ జరుగనున్నాయి.

టీం ఇండియా అద్భుతం విజ‌యం అద్వితీయంటీం ఇండియా అద్భుతం విజ‌యం అద్వితీయం

అహ్మ‌దాబాద్ : భార‌త జ‌ట్టు ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచు కోవ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, మాజీ కోచ్ , కామెంటేట‌ర్ ర‌విశాస్త్రి. ఇది ఎవ‌రూ ఊహించని విజ‌యం అన్నాడు. ఇలాంటి అరుదైన