hyderabadupdates.com Gallery క‌రూర్ తొక్కిస‌లాట కేసులో విజ‌య్ కి సీబీఐ స‌మ‌న్లు

క‌రూర్ తొక్కిస‌లాట కేసులో విజ‌య్ కి సీబీఐ స‌మ‌న్లు

క‌రూర్ తొక్కిస‌లాట కేసులో విజ‌య్ కి సీబీఐ స‌మ‌న్లు post thumbnail image

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర సీమ‌లో టాప్ హీరోగా పేరు పొందిన టీవీకే పార్టీ చీఫ్ త‌ళ‌ప‌తి విజ‌య్ కి బిగ్ షాక్ త‌గిలింది. తాను చేప‌ట్టిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా త‌మిళ‌నాడులోని క‌రూర్ లో చోటు చేసుకున్న తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. రిటైర్డ్ న్యాయ‌మూర్తితో క‌మిష‌న్ ను ఏర్పాటు చేసింది. ఇదే స‌మ‌యంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. దీనికి ప్ర‌ధాన కార‌కుడు విజ‌య్ అంటూ డీఎంకే స‌ర్కార్ పేర్కొంది. ఆయ‌న చెప్పిన స‌మ‌యానికి రాక పోవ‌డం వ‌ల్ల‌నే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని ఆరోపించింది. ఇదిలా ఉండ‌గా మంగ‌ళ‌వారం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు అధికారికంగా న‌టుడు, టీవీకే చీఫ్ విజ‌య్ కి స‌మ‌న్లు జారీ చేసింది.
ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే ప‌లుమార్లు విచార‌ణ చేప‌ట్టింది. ద‌ర్యాప్తులో భాగంగా టీవీకే పార్టీ ఆఫీస్ లో ఇందుకు సంబంధించిన ప‌త్రాల‌ను, సీసీ టీవీ ఫుటేజ్ ల‌ను కూడా తీసుకు వెళ్లింది. ఘ‌ట‌న‌కు సంబంధించి త‌న‌ను బాధ్యుడిని చేస్తూ కేసు న‌మోదు చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ టీవీకే విజ‌య్ భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. స‌రైన భ‌ద్ర‌త క‌ల్పించ‌క పోవ‌డం వ‌ల్ల‌నే ప‌లువురు ప్రాణాలు కోల్పోయార‌ని, వారికి తాను ముందే ప్ర‌క‌టించిన విధంగా ఆర్థిక సాయం కూడా చేశాన‌ని తెలిపాడు కోర్టుకు. కాగా ఈ ఘ‌ట‌న గ‌త ఏడాది 2025సెప్టెంబర్ 27న కరూర్‌లో చోటు చేసుకుంది. మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యంత విషాద‌క‌ర‌మైన ఘ‌ట‌న‌గా దీనిని పేర్కొంది బీజేపీ.
The post క‌రూర్ తొక్కిస‌లాట కేసులో విజ‌య్ కి సీబీఐ స‌మ‌న్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

బీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీబీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ

ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తాజాగా మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) ఎన్నిక‌ల్లో ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు. శుక్ర‌వారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈసీపై

కుమార స్వామిపై భ‌గ్గుమ‌న్న డీకే శివ‌కుమార్కుమార స్వామిపై భ‌గ్గుమ‌న్న డీకే శివ‌కుమార్

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న కేంద్ర మంత్రి జేడీ కుమార స్వామిపై తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. త‌న గురించి లేని పోని కామెంట్స్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. బెంగ‌ళూరులో

అట్లీ స్పెషల్‌ సాంగ్‌!అట్లీ స్పెషల్‌ సాంగ్‌!

అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ అట్లీ కలిసి రూపొందిస్తున్న కొత్త సినిమా కోసం బన్నీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌కు ప్రత్యేకంగా ప్లాన్ జరుగుతోంది. ఆ పాట కోసం