హైదరాబాద్ : నటి అశు రెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది . పెళ్లి పేరుతో ధర్మేంద్ర అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నమ్మించి కోట్ల రూపాయల మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదు కేజీల బంగారాన్ని కొనేలా చేసిందని బాధిత ఫ్యామిలీ వాపోయింది. ఉండేందుకు ఫ్లాట్ కావాలని చెప్పి మూడు కోట్ల ఖరీదైన విల్లాకు సైతం ధర్మేంద్ర నుండి అడ్వాన్స్ తీసుకుంది. వేణుస్వామి తో జాతకాలు సైతం చూపించుకున్నాయి ఇరు కుటుంబాలు. పెళ్లి అవుతుంది అనే నమ్మకంతో ఆశు రెడ్డి ఎంత అడిగితే అంత ఇచ్చుకుంటూ వెళ్లాడు టెక్కీ ధర్మేంద్ర. ఉన్నట్టుండి తాను పెళ్లి చేసుకోవడం లేదంటూ చెప్పేసింది ఆషు రెడ్డి. అయితే తనను పెళ్లి చేసుకో లేదా తన డబ్బులు తనకు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశాడు ధర్మేంద్ర.
స్పందించక పోవడం, ఏదీ చేయక పోవడం తో పోలీస్ లను ఆశ్రయించారు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి. ఆశు రెడ్డి, ఆమె కుటుంబసభ్యుల పై కేస్ నమోదు చేశారు సిసిఎస్ పోలీసులు.రెండు సార్లు ధర్మేంద్ర ను మోసం చేసినట్లు వాపోయారు. ఒకసారి పెళ్లి రద్దు చేసుకున్నాక డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. తమ వద్ద డబ్బులు లేవని, తిరిగి పెళ్లి చేసుకుంటానంటూ మరోసారి మోసానికి పాల్పడింది ఆశు రెడ్డి. లండన్ లో ఉంటున్న ధర్మేంద్ర నుండి 9.83 కోట్లు గోల్డ్, డబ్బు, ఫ్లాట్ రాయించుకుంది. ఆశు రెడ్డి సోదరి దివ్యా రెడ్డి కు సైతం 50 లక్షలు ఇచ్చినట్లు చెప్పాడు ధర్మేంద్ర. వివిధ కారణాలు చెప్పి తమ కుమారుడిని హనీ ట్రాప్ చేసి ఇలా మోసం చేస్తున్నారని ధర్మేంద్ర తండ్రి పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వకపోగా రిటర్న్ లో కేస్ పెడతానని బెదిరింపులకు పాల్పడింది ఆశు రెడ్డి. దీంతో ఆశు రెడ్డి ఫ్యామిలి పై BNS 318(4)r/w3(5) సెక్షన్ ల కింద కేస్ నమోదు చేశారు.
The post సినీ నటి ఆశురెడ్డి ఫ్యామిలీ పై కేసు నమోదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
సినీ నటి ఆశురెడ్డి ఫ్యామిలీ పై కేసు నమోదు
Categories: