hyderabadupdates.com Gallery అవార్డు అందుకోవ‌డం ఆనందంగా ఉంది : సీఎం

అవార్డు అందుకోవ‌డం ఆనందంగా ఉంది : సీఎం

అవార్డు అందుకోవ‌డం ఆనందంగా ఉంది : సీఎం post thumbnail image

ముంబై : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ముంబై వేదిక‌గా ప్రతిష్టాత్మక మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు. అవార్డుల కార్యక్రమంలో ముఖాముఖి మాట్లాడారు సీఎం. దేశంలో ఆర్ధిక సంస్కరణల తర్వాత నేను ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావటం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో సంస్కరణలకు ముందు తర్వాత భారత దేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశానని చెప్పారు. సంస్కరణలకు అనుగుణంగానే విజన్ 2020ను అమలు చేశాం అని వెల్ల‌డించారు. ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్న అభివృద్ధి ఫలాలు అవేన‌ని తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పుడు 2047 వికసిత్ భారత్ రూపకల్పన చేశార‌ని కొనియాడారు.
అందులో ఏపీ అగ్రస్థానంలో ఉండాలన్నదే నా ఆకాంక్షఅని ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు నాయుడు. 1990లో వచ్చిన ఐటీ విప్లవాన్ని అంది పుచ్చుకున్నాం అన్నారు. ఇప్పుడు క్వాంటం, ఏఐ లాంటి ఆధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చేశాయన్నారు. ఇప్పుడు ఆ టెక్నాలజీలను అందిపుచ్చుకుని అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు సీఎం. గతంలో విద్యుత్ సంస్కరణల్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసి మిగులు విద్యుత్ సాధించాం అన్నారు. రాష్ట్రంలో వినియోగదారులకు మేలు కలిగేలా నియంత్రణా కమిషన్ ను కూడా తీసుకు వచ్చామ‌ని తెలిపారు. సౌర, పునరుద్పాదక విద్యుత్ కు కూడా పెద్ద ఎత్తున భారత్ లో ప్రోత్సాహం కల్పించ‌డం జ‌రిగింద‌న్నారు సీఎం.
The post అవార్డు అందుకోవ‌డం ఆనందంగా ఉంది : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మ‌హిళా కోటా చ‌ట్టాన్ని రాజ‌కీయం చేయొద్దుమ‌హిళా కోటా చ‌ట్టాన్ని రాజ‌కీయం చేయొద్దు

న్యూఢిల్లీ : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మహిళా కోటా చట్టాన్ని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు చుర‌క‌లు అంటించారు. గురువారం పార్ల‌మెంట్ సాక్షిగా ప్ర‌సంగించారు. విప‌క్షాల‌ను ఏకి పారేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఉన్న భయాలను తొలగించారు. తూర్పు

Karur Stampede: సీబీఐ చేతికి కరూర్‌ తొక్కిసలాట కేసుKarur Stampede: సీబీఐ చేతికి కరూర్‌ తొక్కిసలాట కేసు

Karur Stampede : కరూర్‌ తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌కు(CBI) అప్పగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తునకు మద్రాసు హైకోర్టు నిరాకరించడంతో పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు.

AP Police: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులుAP Police: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు

    కర్నూలు బస్సు ప్రమాదం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై ఏపీ ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిలో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు వచ్చారు. కర్నూలు బస్సు ప్రమాదానికి మద్యం కారణమని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై